Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (11:19 IST)
అలనాటి నటి పుష్పలత కన్నుమూశారు. ఆమెకు వయసు 87 సంవత్సరాలు. వయోభారం కారణంగా శ్వాసపీల్చడంలో సమస్యలు తలెత్తడంతో చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు ఆమె భర్త, సినీ నటుడు ఏవీఎం రాజన్ వెల్లడించారు. చెన్నై టీ నగర్‌లోని తిరుమలపిళ్లై రోడ్డులో ఆమె పార్థివదేహాన్ని అభిమానులు, కుటుంబ సభ్యుల సందర్శనకు ఉంచారు. 
 
1958లో వచ్చిన 'సెంగోట్టై సింగం' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె 1961లో 'కొంగునాట్టు తంగం' అనే చిత్రంతో హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, ఎంఎస్ రాజేంద్ర‌న్ వంటి అగ్ర నటుల సరసన నటించారు. 'నానుమ్ ఒరు పెణ్ అనే చిత్రంలో నటుడు ఏవీఎం రాజన్‌తో కలిసి నటించారు. ఆ తర్వాత ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వీరిలో ఆమె కుమార్తె మహాలక్ష్మి కూడా ఓ సినీ నటే. 
 
పుష్పలత తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందకుపైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో 'పెద్దకొడుకు', 'మేము మనుషులమే', 'అన్నదమ్ముల అనుబంధం', 'యుగపురుషుడు', 'శ్రీరామ పట్టాభిషేకం', 'వేటగాడు', 'రాధా 'కళ్యాణం', 'కొండవీటి సింహం' చిత్రాల్లో నటించారు. ఏవీఎం సంస్థ నిర్మించిన 'రాము' చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించారు.
 
1963లో 'మైన్ భీ లక్కీ హూన్' అనే హిందీ చిత్రంలో, 'నర్స్' అనే మలయాళ చిత్రంలోనూ నటించారు. 'సకలకళా వల్లభన్', 'నాన్ అడిమై ఇలై' వంటి చిత్రాల్లో సహాయ నటిగా నటించారు. ఆమె చివరగా మురళి హీరోగా నటించిన 'పూవాసమ్'(1999) అనే తమిళ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆమె సినిమాల వైపు తిరిగి చూడలేదు. 
 
ఆమె మృతిపై పలువురు తమిళ సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. కాగా, పుష్పలత కుమార్తె మహాలక్ష్మి 'రెండు జెళ్ల సీత', 'ఆనంద భైరవి', 'మాయదారి మరిది', 'రుణానుబంధం' చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments