Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీబీ ఆరోగ్యం మెరుగుపడుతోంది.. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (10:46 IST)
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ఆరోగ్య బులిటెన్‌ను విడుదల చేశారు. 
 
ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఎస్పీబీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యులు అడిగిన దానికి స్పందిస్తున్నారని చెప్పారు. ఫిజియోథెరపీ చికిత్స కూడా కొనసాగుతోందని, నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వివరించింది. 
 
ఎస్పీబీ తనయుడు చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే ఈ రోజు మరింత మెరుగైనట్టు చెప్పారు. వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తన తండ్రి కోలుకోవాలని అందరూ చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చరణ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments