Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అమ్మను అనగానే రోషమొచ్చిందా : పవన్‌పై విరుచుకుపడిన శ్రీరెడ్డి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి మరోమారు విరుచుకుపడింది. మీ అమ్మనంటే మీకు రోషమొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై ఆమె తాజాగా ఓ ట్వీట్ చేసింది.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:01 IST)
అమ్మ ఎవరికైనా అమ్మేనని, మీ అమ్మని అనగానే బాధ అనిపిస్తే మరి మా తల్లుల సంగతేంటని నిలదీసింది. తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని, తనను ఎవరూ వెనకుండి నడిపించడం లేదని స్పష్టం చేసింది. పోరాటాలు చేస్తున్నట్టు నటించడం తనకు చేతకాదని ఎద్దేవా చేసింది.
 
అసలు ప్యాకేజీల కోసం పోరాటాలు చేసేది ఎవరో అందరూ గమనిస్తున్నారని పేర్కొంది. 'మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకూ అంతే'నని పేర్కొన్న శ్రీరెడ్డి.. తమని అన్నప్పుడు, తమ తల్లులను దూషించినప్పుడు, రోడ్డు మీద పడి రేప్‌లు చేస్తున్నప్పుడు, యాసిడ్ దాడులకు తెగబడుతున్నప్పుడు తమ బాధ అర్థం కాలేదా? అని ప్రశ్నించింది.
తాను అన్నింటికీ సిద్ధపడే పోరాటంలోకి దిగానని, ప్రాణాలకు సైతం లెక్క చేయనని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. పవన్ తన ఆధిపత్యాన్ని సినిమాల్లో చూపించాలని, ఫిలిం చాంబర్‌పైన కాదని హితవు పలికింది. జర్నలిస్టుల జోలికి రావద్దని హెచ్చరించింది. ఏదో ఒకరోజ నిజాలు బయటకు వస్తాయని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments