Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ నుంచి అఖిల్ దాకా.. ఆ కుటుంబంలో ఎవరినీ వదలని పొడుగాటి సుందరి

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో మెరుపులా మెరిసి ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితమైన పొడుగుకాళ్ల సుందరి టబు టాలీవుడ్‌లో నాగార్జున సరసన నిన్నే పెళ్లాడుతా సినిమాలో నటించి ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రేమలోని సున్నితభావాన్ని, కుటుంబ బంధాల గొప్పతనాన్ని అ

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (04:15 IST)
దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో మెరుపులా మెరిసి ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితమైన పొడుగుకాళ్ల సుందరి టబు టాలీవుడ్‌లో నాగార్జున సరసన నిన్నే పెళ్లాడుతా సినిమాలో నటించి ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రేమలోని సున్నితభావాన్ని, కుటుంబ బంధాల గొప్పతనాన్ని అజరామరంగా చిత్రించిన ఆ సినిమా నాగార్జున చిత్రాల్లో అద్భుత ప్రేమ చిత్రంగా మిగిలిపోయింది. ఇక టబు అయితే ఆనాటినుంచి నేటివరకూ నాగ్ ప్యామిలీకి అత్యంత సన్నిహితురాలిగా మారిపోయింది. 
 
తండ్రితో ప్రేమరసాన్ని చిరస్మరణీయంగా అభినయించిన అందాల టబు ఇప్పుడు ఆ తండ్రి కుమారుడు అఖిల్‌ సినిమాలో నటించడానికి సిద్ధమైపోయింది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. అయితే టబు చేస్తుంది తల్లి పాత్రే అయినా..అది హీరో తల్లి పాత్రనా.. లేక హీరోయిన్ తల్లి పాత్రనా తెలియాల్సి ఉంది.
 
తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో టబు పై సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు.  మనం, 24 సినిమాల ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
 
తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గతంలో నాగ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్న విషయం తెలిసిందే.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments