Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ యాంకర్, కలిసుందాం రా నటి మల్లిక మృతి.. రెండు వారాలు కోమాలోనే వుండి?

ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక కన్నుమూశారు. తొలి తరం టీవీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న మల్లిక అనారోగ్యం కారణంగా కోమాలో వున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి బెంగళూరులో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచార

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (17:30 IST)
ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక కన్నుమూశారు. తొలి తరం టీవీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న మల్లిక అనారోగ్యం కారణంగా కోమాలో వున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి బెంగళూరులో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మల్లిక మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఆమె కుటుంబసభ్యులకు సినీ తారలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. 
 
మరణించేనాటికి మల్లికకు 39 సంవత్సరాలు. భర్త బెంగళూరులో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె అక్కడే నివాసం వున్నారు. మల్లికకు ఓ కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో రెండు వారాల పాటు కోమాలోకి వెళ్లిపోయిన మల్లిక.. అసలు పేరు అభినవ.

వెంకటేష్ కలిసుందాం రా, నిన్నే పెళ్ళాడుతా వంటి పలు  సినిమాల్లో ఆమె నటించారు. యాంకర్‌గా, సీరియల్ నటిగా ప్రేక్షకుల ఆదరణ పొందిన మల్లిక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1999లో కృష్ణగారి రాజకుమారుడు చిత్రంలోనూ నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments