Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (15:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సోమవారం సమావేశమయ్యారు. ఇందుకోసం ఏపీ సినీ ప్రముఖులు ఏపీ సచివాలయానికి ఇప్పటికే చేరుకున్నారు. 
 
ముఖ్యంగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ సర్కారు ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు వీలుగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు, ఎక్జిబిటర్‌లు సోమవారం ఉదయం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. 
 
ముఖ్యంగా, ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ విధానంపై సినీ ప్రముఖులు తమ వైఖరిని ప్రభుత్వానికి స్పష్టంచేయనున్నారు. ప్రభుత్వంతో సమావేశానికి ముందు 13 జిల్లాల ప్రొడ్యూసర్‌లు డిస్ట్రిబ్యూటర్‌లు, ఎక్జిబిటర్లు విజయవాడలో భేటి అయ్యారు. 
 
ప్రభుత్వం తీసుకున్న ఆన్‌లైన్ విధానానికి మద్దతు తెలుపుతూనే తమకు ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వానికి ప్రతినిధులు తెలుపనున్నారు. ఇందులో అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, డివివి దానయ్య, సి.కళ్యాణ్, అదిశేషగిరావు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మంత్రి పేర్ని నాని తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments