Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ నగర్‌ గేటుకు కట్టేసి కొడతా.. రష్మీకి నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (14:21 IST)
బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్‌కు తెలుగు చిత్ర నిర్మాత నాగలింగం గట్టివార్నింగ్ ఇచ్చారు. ఫిల్మ్ నగర్ గేటుకు కట్టేసి కొడతానంటూ హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరిక చేసింది ఇపుడు కాదు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన "రాజు గారి బంగ్లా" సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో తన పట్ల రష్మీ చాలా దురుసుగా ప్రవర్తించిందని ఆయన తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
నాడు రష్మీతో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన అంశాలను ఆయన తాజాగా వెల్లడించారు. "రాణి గారి బంగ్లా" సినిమా షూటింగ్ సమయంలో రష్మీ చాలా దురుసుగా ప్రవర్తించారు. సగం సినిమా షూటింగ్ పూర్తయ్యాక హీరోను మార్చాలని పట్టుబట్టారు. సినిమా సగం షూటింగ్ పూర్తయ్యాక హీరోను ఎలా మారుస్తామని నచ్చజెప్పినా ఆమె వినిపించుకోకుండా తనను బెదిరించారు. నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు ఇలా తనను పలువురి పేర్లు చెప్పి బెదిరించారు. దీంతో నేను కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించాను. నీకే కాదు నాక్కూడా చాలా మంది తెలుసు. మర్యాదగా షూటింగ్ పూర్తి చేయకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఫిల్మ్ నగర్ గేట్లను కట్టేసి కొడతానంటూ హెచ్చరించాను. దీంతో ఆమె దిగివచ్చి సినిమా షూటింగ్ పూర్తి చేశారు అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments