Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ వారి ఆలయ నేపథ్యంతో వారాహి చిత్రం

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (16:48 IST)
Sumanth, VV Vinayak and others
వారాహి అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో వారాహి ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మ వారి ఆలయ నేపథ్యంతో సుమంత్ హీరోగా వారాహి చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. వీరి కాంబినేషన్ లో గతంలో సుబ్రహ్మణ్యపురం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో సుమంత్, సంతోష్ జాగర్లపూడి కొత్త చిత్రం వారాహిపై ఆసక్తి ఏర్పుడుతోంది. ఈ చిత్రాన్ని జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్నారు. 
 
సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు వీవీ వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డివోషనల్ బేస్డ్ మూవీగా ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు. ఈ సందర్భంగా
 
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ...ఇవాళ మా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించాం. సప్త మాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారి నేపథ్యంలో డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే నెల నుండి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అన్నారు.
 
హీరో సుమంత్ మాట్లాడుతూ... సంతోష్ ఈ కథ చెప్పగానే క్లాప్స్ కొట్టాను. భారీ ఎత్తున ఈ సినిమా చేయబోతున్నాం. మా కాంబినేషన్ లో వచ్చిన సుబ్రమణ్యపురం కంటే చాలా బెటర్ స్క్రిప్ట్ ఇది. ఇటీవల కాంతార, కార్తికేయ 2 చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి ఒక డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా వారాహి ఆకట్టుకుంది. అన్నారు.
 
సత్యసాయి శ్రీనివాస్, గెటప్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - ఈశ్వర్ చంద్. కె ఆర్ ప్రదీప్ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments