Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో బాలీవుడ్ భామలు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (17:27 IST)
ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అకాడ‌మీ కొత్త స‌భ్యుల వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించింది. ఈ జాబితాలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు భామలకు చోటు దక్కింది. ఇందులో బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌తో పాటు టీవీ నిర్మాత ఏక్తా కపూర్‌, ఆమె త‌ల్లి శోభా క‌పూర్‌లో ఈ ఏడాది రిలీజ్ చేసిన ఆస్కార్ కొత్త క‌మిటీలో స‌భ్యులుగా ఉన్నారు. 
 
మొత్తం 50 దేశాల‌కు చెందిన 395 మంది స‌భ్యుల‌తో జాబితాను ఆస్కార్ అకాడ‌మీ రిలీజ్ చేసింది. 'ద క్లాస్ ఆఫ్ 2021' పేరుతో రిలీజ్ చేసిన లిస్టులో 46 శాతం మంది మ‌హిళ‌లు ఉండటం గమనార్హం. 
 
'మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌హానీ', 'ఫ్యామిలీ డ్రామా తుమ్‌హ‌రి సులు' లాంటి చిత్రాల్లో విద్యాబాల‌న్ న‌టించి ప్ర‌శంస‌లు పొందారు. 2011లో వ‌చ్చిన "ద డ‌ర్టీ పిక్చ‌ర్" సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన విద్యాబాల‌న్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే.
 
ఇకపోతే, బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూస‌ర్లు ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్‌లు కూడా ఆస్కార్ అకాడ‌మీలో కొత్త స‌భ్యుల‌య్యారు. 'డ్రీమ్ గ‌ర్ల్‌', 'వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై', 'ఉడ్తా పంజాబ్'‌, 'డ‌ర్టీ పిక్చ‌ర్' లాంటి సినిమాల‌కు వీళ్లు నిర్మాత‌లుగా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments