Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ పాదాభివంద‌నం - సారీ చెప్పిన మనోజ్ దేశాయ్

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:19 IST)
Vijay Devarakonda Padabhivandanam to Manoj Desai
ఇప్పుడు హాట్ టాపిక్ విజయ్ దేవరకొండ. లైగ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా విజయ్ దేవరకొండ ఆట్యిట్యూడ్ గురించి పెద్ద చ‌ర్చ జ‌రిగింది. దీనిపై విజయ్ దేవరకొండ ప‌లువురిని క‌లిసి క్లారిటీ ఇచ్చాడు. ఈ విధానాన్ని చూసిన బాలీవుడ్‌లోని సీనియ‌ర్ విశ్లేష‌కుడు  అశ్వీనీకుమార్ మాట్లాడుతూ.. నా 20 ఏళ్ల ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిజం కెరీర్‌లో, ఎలాంటి అపార్థాన్ని క్లియర్ చేయడానికి ఏ స్టార్ ఇంత దూరం వెళ్లడం నేను చూడలేదు. అంటూ పోస్ట్ చేశాడు.
 
ఈ విష‌య‌మై బాలీవుడ్‌లో థియేటర్లు వున్న ప్ర‌ముఖ ఎగ్జిబిట‌ర్ మనోజ్ దేశాయ్, విజ‌య్‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. ఆయ‌న న‌డ‌వ‌డిక మార్చుకోవాల‌నీ, అస‌లు లైగ‌ర్ సినిమాకు విజయ్ దేవరకొండ ప్ర‌ధాన మైన‌స్ అంటూ విశ్లేషించాడు. ఆ త‌ర్వాత సినిమా చూశారు. ఈ సంద‌ర్భంగా విజయ్ దేవరకొండ నిన్న ముంబై వెళ్ళి మ‌నోజ్ దేశాయ్‌కు క‌లిసి ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేశారు.
 
అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. తాను మొద‌టినుంచి ఎలా వుంటానో, నా నైజం ఏమిటో, నేను అన్న మాట‌లు ఎలా వ‌క్రీక‌రించ‌బ‌డ్డాయో మ‌నోజ్‌కు విజ‌య్ వివ‌రించారు. పిద‌ప మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ, విజ‌య్  నిజంగా చాలా మంచి వ్యక్తి, డౌన్ టు ఎర్త్, నేను అతనిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. నేను అతని చిత్రాలన్నీ చూస్తానని వాగ్దానం చేస్తున్నాను. నేను అతనికి అన్ని శుభాలను కోరుకుంటున్నాను” అంటూ ఆశీర్వ‌దించారు. నేను ఇద్ద‌రికి క్ష‌మాప‌ణ కోరుతున్నా.

గ‌తంలో ఖుదాగ‌వా సినిమా టైంలో అమితాబ్‌కు క్ష‌మాప‌ణ చెప్పాను. ఇప్పుడు లైగ‌ర్ ద్వారా విజ‌య్‌కు క్ష‌మాప‌ణ చెబుతున్నానంటూ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్‌.. మ‌నోజ్ ఆప్యాయంగా కౌగ‌లించుకున్నారు. సో. విజ‌య్‌.. మంచిత‌నం సోష‌ల్ మీడియాలో మ‌రో ర‌కంగా రాయ‌డం  ప‌ట్ల ఆయ‌న అభిమానులు చాలా మ‌ద‌న‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. దీనితో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇష్యూ స‌ద్దు మ‌ణిగింద‌ని బాలీవుడ్ మీడియా తెలియ‌జేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments