Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్మ‌యి, వైర‌ముత్తు వివాదంపై విశాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (11:07 IST)
తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి, తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తుపై కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలు కోలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం అయ్యింది. చిన్మయి తనకు వైరముత్తుతో ఎదురైన చేదు అనుభవాలతో పాటు.. ఆయన బాధిత మహిళలు మరిందరి తరఫున గళం వినిపిస్తోంది. వాళ్లు చేసే ఆరోపణల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇంకా మరిందరు బాధితుల పక్షాన ఆమె పెద్ద ఉద్యమమే చేస్తోంది. 
 
ఐతే వైరముత్తుకు కోలీవుడ్లో మంచి పేరుంది. ఈ కార‌ణంతోనే అనుకుంట‌ా అక్కడి ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. చాలామంది మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో నడిగర్ సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఈ వివాదంపై స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 
 
అంతే కాకుండా... అందరిలో కదలిక తెచ్చే ప్రయత్నం చేశాడని చెప్ప‌చ్చు. ఇంత‌కీ విశాల్ ఏమ‌న్నాడంటే... చిన్మయితో పాటు ఇంకొందరు మహిళలు చేస్తున్న ఆరోపణల్ని తాను గౌరవిస్తానని.. ఐతే ఇలాంటి విషయాల్లో సినీ రంగంలోని మహిళలు వెంటనే స్పందించాలని కోరాడు. 
గతంలో అమలా పాల్ తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే వెంటనే తమను ఆశ్రయించిందని.. తగు చర్యలు చేపట్టామని చెప్పాడు. అలాగే మిగతా మహిళలు కూడా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తేవాలన్నాడు. ఇక వైరముత్తుపై వచ్చిన ఆరోపణల్ని పరిశీలిస్తున్నామని.. ఆయనపై నిషేధం విధించే విషయంపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని విశాల్ చెప్పాడు. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది తేలాల్సి ఉందని విశాల్ చెప్పాడు. దీనిపై ఇండస్ట్రీ పెద్దలతో చర్చిస్తున్నట్లు విశాల్ తెలియ‌చేసాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments