Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు నోటిపై వేళ్ళేసుకున్నారట.. ఎందుకు?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (22:34 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఇప్పటికే సినీ యూనిట్ సభ్యుల్లో ఉంది. స్వయంగా చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన నిర్మాతగా ఈ చిత్రం నిర్మింతం కాగా సురేంద్రరెడ్డి దర్సకత్వం వహించారు.
 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో తెరకెక్కిన చిత్రంలో చిరంజీవి నటన అద్భుతమంటున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు. సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు సెన్సార్ బోర్డుకు సినిమా చూపించి అందులో సన్నివేశాలను కట్ చేస్తూ ఉంటారు. అయితే సైరా సినిమా చూసిన అభిమానులు మాత్రం అద్భుతంగా ఉందంటూ కితాబివ్వడమే కాకుండా యుఎ సర్టిఫికెట్ ఇచ్చారట. 
 
అంతేకాదు ఒక్క సన్నివేశాన్ని కూడా కట్ చేయలేదట. సెన్సార్ బోర్డు సభ్యులు ఎప్పుడూ సినిమా విజయవంతం అవుతుందా లేదా అన్న విషయం చెప్పరు. కానీ సైరా సినిమా చూసిన తరువాత సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా వందరోజులకు పైగా ఆడుతుందని.. మెగాస్టార్ పేరును మరింత పెంచేస్తుందని చెప్పారట. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments