Webdunia - Bharat's app for daily news and videos

Install App

2వేల థియేటర్లలో ప్రీమియర్ షోస్.. భరత్ అనే నేను ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్ మాత్రమే?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ''భరత్ అనే నేను'' సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌‌లో మహేష్‌కు మంచి మార్

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (11:57 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ''భరత్ అనే నేను'' సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌‌లో మహేష్‌కు మంచి మార్కెట్‌ ఉంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఫ్లాప్‌ సినిమాలు కూడా అక్కడ మిలియన్‌ డాలర్ల వసూళ్లు కురిపిస్తాయి.

ఈ కారణంతోనే ''భరత్ అనే నేను'' సినిమాల్లో విదేశాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 19న దాదాపు 2000 ప్రీమియర్‌ షోస్‌ వేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. 
 
గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో ప్రీమియర్స్‌ షోస్‌‌ను ప్రదర్శించలేదు. దీంతో పాటు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే భరత్ అనే నేను మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంటుందని సినీ యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు ప్రిన్స్ ఫ్యాన్స్‌ మధ్య భారీ అంచనాలను పెంచేశాయి. శనివారం (ఏప్రిల్-7)న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. 
 
ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. శనివారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్- ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ వేడుకకు ఎన్టీఆర్, చరణ్‌లను ముఖ్య అతిథులుగా మహేశ్‌బాబు ఆహ్వానించినట్టు సమాచారం. కానీ ఈ వేడుకకు ఎన్టీఆర్ మాత్రమే హాజరవుతున్నారని తెలిసింది. అనివార్య కారణాల వల్ల చెర్రీ రాలేకపోతున్నాడని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments