Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమాలో వెంకీ సరసన నయనతార.. చైతూకు జోడీగా రకుల్..?

దర్శకుడు బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య కథానాయకులుగా భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను మొ

Webdunia
శనివారం, 26 మే 2018 (13:29 IST)
దర్శకుడు బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య కథానాయకులుగా భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో ముందుగా కథానాయికల ఎంపికను పూర్తి చేశారు. ఇందులో భాగంగా వెంకటేశ్ సరసన నయనతారను, చైతూ జోడిగా రకుల్‌ ప్రీత్ సింగ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 
 
గతంలో వెంకటేశ్-నయనతార కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి, తులసి, బాబు బంగారం సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో కథానాయికగా నయనతారను సంప్రదించారట. త్వరలోనే ఈ సినిమాకు నయన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. 
 
అలాగే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో చైతూ జోడీగా రకుల్ అదరగొట్టింది. అదే క్రేజ్‌తో రెండోసారి చైతూతో ఆమె జోడీ కట్టనుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments