Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లవ్ స్టోరీ" నుంచి 'ఏవో ఏవో కలలే'... మహేష్ చేతుల మీదుగా రిలీజ్ (Video)

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (18:47 IST)
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం "లవ్‌స్టోరీ". ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే 'సారంగదరియా' అనే పాటను రిలీజ్ చేయగా అది సంచలనాలు సృష్టిస్తోంది. పైగా, ఓ వివాదం కూడా చెలరేగింది. ఇది టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. 
 
ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాట రిలీజైంది. 'ఏవో ఏవో కలలే' అనే గీతాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. 'ఏవో ఏవో కలలే' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని మహేశ్ బాబు పేర్కొన్నారు. 
 
నిర్మాత నారాయణ దాస్ నారంగ్‌తో పాటు యావత్ చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. 'ఏవో ఏవో కలలే' గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. పవన్ సీహెచ్ సంగీత దర్శకుడు. సున్నితమైన ప్రేమకథా చిత్రంగా వస్తున్న 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజైన 'సారంగ దరియా' గీతం విశేషరీతిలో ప్రజాదరణ పొందింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments