Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 1100 రైళ్లు రద్దు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 5 మే 2022 (11:28 IST)
దేశ వ్యాప్తంగా దాదాపు 1100 రైళ్లను భారతీయ రైల్వే శాఖ రద్దుచేసింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం క్రమక్రమంగా పెరుగుతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, నేలబొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికితోడు వేసవి ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కరెంట్ డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. బొగ్గు ఉత్పత్తిలో కొరత ఏర్పడంతో విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా సాగడం లేదు. దీంతో ఇండియన్ రైల్వే ఈ సంక్షోభంపై దృష్టిసారించింది. 
 
విద్యుత్ కేంద్రాలకు త్వరితగతిన బొగ్గును తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం గూడ్సు రైళ్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, భారీగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 1100 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. 
 
ఇప్పటికే అనేక రైళ్లు ఉన్నాయి. వీటిలో 500 ట్రిప్పుల ఎక్స్‌ప్రెస్ మెయిల్ రైళ్లు, 580 ట్రిప్పుల ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 29వ తేదీన బొగ్గు రైళ్ళను నడిపేందుకు వీలుగా ఏకంగా 240 ప్యాసింజర్ ట్రైన్స్‌ను రైల్వే శాఖ రద్దుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం