Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు - కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామంటున్న సీఎం సన్

తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్ల తమ ఇంట అవినీతికి ఛాన్సేలేదన్నారు.

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (16:56 IST)
తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్ల తమ ఇంట అవినీతికి ఛాన్సేలేదన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో తాగునీటి ట్యాంకర్లలో అవినీతి జరుగుతోందని బీజేపీ పక్షనేత సోము వీర్రాజు ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదన్నారు. 
 
అలాగే తన శాఖలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడం లేదన్నారు. తన కుటుంబం పాలు, కూరగాయలు అమ్మి డబ్బు సంపాదిస్తోందని.. చివరికి తన క్రెడిట్‌ కార్డు బిల్లు కూడా వారే కడతారని చెప్పారు. తన శాఖలో అవినీతి జరుగుతున్నట్లు ఆధారాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. 
 
అలాగే, విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలకు నింబంధనల ప్రకారమే సంస్థలకు భూములు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేస్తున్న వారు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చినా... 21 రోజుల్లోనే భూములు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి బయట ఉన్న పార్టీ సభ్యులు, లోపలే ఉండి విమర్శలు చేస్తున్న సభ్యులు తెలుసుకునేందుకే తాను ఈ విషయాలను చెబుతున్నానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments