Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రిపదవులకు గజపతిరాజు - సుజనా చౌదరీలు రాజీనామా

కేంద్రమంత్రి పదవులకు టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. వారిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం సాయంత్రం తమ రాజీనామా లేఖలను స్వయంగా అందజేశారు.

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (18:13 IST)
కేంద్రమంత్రి పదవులకు టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. వారిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం సాయంత్రం తమ రాజీనామా లేఖలను స్వయంగా అందజేశారు.
 
నిజానికి వారిద్దరూ బుధవారం రాత్రే రాజీనామా చేయాల్సి వుంది. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ అందుబాటులో లేకపోవడంతో వారు రాజీనామా చేయలేదు. ఆ తర్వాత గురువారం ఉదయం ప్రధాని మోడీ రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు.
 
అక్కడ నుంచి తిరిగివచ్చాక గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో వీరిద్దరూ ప్రధాని మోడీని కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తాము ఏయే కార‌ణాల వ‌ల్ల కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నామో మోడీకి వివరించారు. 
 
కాగా, టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన అశోకగజపతి రాజు కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రిగా ఉన్నారు. ఈయన కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ విమానాల్లో ప్రయాణించేందుకు అవసరమైన బోర్డింగ్ పాస్‌లు తీసుకునేటపుడు, విమానం ఎక్కేటపుడు ఒక సాధారణ పౌరుడిలా నడుచుకునేవారు. అలాగే, మరో సీనియర్ నేత వైవీఎస్ చౌదరి (సుజనా చౌదరి) కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments