Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ వేదికగా 'స్వామి' బలపరీక్ష - కన్నడ సభలో ఏం జరగబోతుంది?

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమార స్వామి శుక్రవారం శాసనసభ వేదికగా తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ విశ్వాస పరీక్షలో ఆయన గట్టెక్కుతారా? కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ఏకతాటి

Webdunia
గురువారం, 24 మే 2018 (15:51 IST)
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమార స్వామి శుక్రవారం శాసనసభ వేదికగా తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ విశ్వాస పరీక్షలో ఆయన గట్టెక్కుతారా? కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై ఉంటారా? సభకు అందరూ హాజరవుతారా? కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు అయితే పరిస్థితి ఏమిటి? అసలు శుక్రవారం సభలో ఏం జరుగబోతుందనే అంశంపై ఇపుడు కన్నడనాట సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంమీద కర్ణాటక అసెంబ్లీ వేదికగా మరోసారి హైడ్రామా జరగబోతోందా?
 
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులుండగా రెండు స్థానాలకు ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం 222 మంది సభ్యులున్న శాసనసభలో విశ్వాస పరీక్షలో గట్టెక్కాలంటే స్పీకర్ మినహా 111 మంది మద్దతుండాలి. కాంగ్రెస్ పార్టీకి 78 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీఎస్‌కు 38 మంది సభ్యులు ఉన్నారు. అయితే కుమారస్వామి రెండు నియోజకవర్గాల్లో పోటీచేసినందున వారిసంఖ్య 37గా లెక్కించుకోవాలి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రభుత్వ పక్షంవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వ బలం 117 అవుతుంది. అంటే అందరూ ఓటేస్తే ప్రభుత్వం సునాయాసంగా గట్టెక్కుతుంది.
 
అయితే, యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందు నుంచి ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా రిసార్ట్స్‌లలోనే ఉంటున్నారు. విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఆ తర్వాత కుమార స్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేలంతా రిసార్టుల్లోనే ఉంచారు. 
 
ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా వదిలేస్తే వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారని బీజేపీ చీఫ్ అమిత్ షా స్వయంగా ప్రకటించారు. అలాగే, జేడీఎస్‌తో కలవడం 90 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదని మాజీ సీఎం యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే సంకీర్ణ భాగస్వాముల్లో గుబులు రేపుతున్నాయి. 104 మంది సభ్యులున్న బీజేపీ కూడా విశ్వాస పరీక్ష సమయంలో సభకు హాజరు కావాలని భావిస్తోంది. అయితే విశ్వాస పరీక్ష సమయంలో ఓటెయ్యకుండా ఉండిపోవాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments