Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ మహమ్మారి నుంచి 42 లక్షల మంది ప్రాణాలు కాపాడిన కోవిడ్ టీకా

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (09:17 IST)
కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోవిడ్ టీకా అనేక లక్షల మంది ప్రాణలను కాపాడింది. భారత్‌లో తయారైన కోవిడ్ టీకాలు కోట్లాది మందికి సంజీవనిలా పనిచేసింది. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 42 లక్షల మరణాలను వ్యాక్సిన్‌ నిలువరించిందని పేర్కొంది. 
 
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల ప్రాణాలు కాపాడినట్లు తేల్చింది. కరోనా మహమ్మారి నుంచి టీకా ఎంత అద్భుతంగా ప్రజలను కాపాడిందో తెలుపుతూ.. అధ్యయన వివరాలను ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్‌’ ప్రచురించింది. మహమ్మారి బారినపడి ప్రపంచమంతా విలవిలలాడుతున్న తరుణంలో వచ్చిన కొవిడ్‌ టీకా.. కరోనా మృత్యుకోరలు పీకేయడంలో కీలకంగా వ్యవహరించిందని, అధిక ప్రాణనష్టం సంభవించకుండా కాపాడిందని అధ్యయనం తేల్చింది. 
 
విశ్వవ్యాప్తంగా దుర్భర, కఠిన పరిస్థితులను వ్యాక్సిన్లు నివారించాయని, వైరస్‌ను సమర్థంగా నిరోధించాయని పేర్కొంది. చైనా మినహా ప్రపంచంలోని 185 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. కొవిడ్‌ వ్యాప్తి, బాధితులు, మరణాలు సహా ఎలాంటి ఖచ్చితమైన సమాచారం బహిర్గతం కాని కారణంగా ఈ అధ్యయనంలో చైనాను పరిగణనలోకి తీసుకోలేదని అధ్యయనకర్తలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments