Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతక వ్యాధిగా మారిన డెంగీ... వ్యాక్సిన్ కావాలంటున్న సైంటిస్టులు

Webdunia
మంగళవారం, 2 మే 2023 (11:05 IST)
డెంగీ వైరస్ తన రూపు మార్చుకుంటుంది. దీంతో ప్రస్తుతం ఇది ప్రాణాంతక వ్యాధిగా మారింది. ఈ వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు కోరుతున్నారు. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 
 
భారత్‌లోని డెంగీ వైరస్ కొత్త రూపు దాల్చినట్టు పేర్కొంది. దీన్ని కట్టడి చేయాలంటే తక్షణం ఒక వ్యాక్సిన్ అవసరమని తెలిపింది. గత ఆరు దశాబ్దాలుగా దేశంలో నమోదైన డెంగీ డేటాను విశ్లేషించి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
 
ఈ అధ్యయనంలో పలు సంస్థలు పాలుపంచుకున్నాయి. డెంగీ కేసులు గత 50 యేళ్లుగా నిలకడగా పెరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా సైంటిస్టులు డెంగీ వైరస్‌కు చెందిన నాలుగు సీరోటైప్‌లపై అధ్యయనం చేశారు. తమ పూర్వ వేరియంట్లతో పోల్చతే ఈ సీరోటైప్‌లు ఎంత మేర రూపాంతరం చెందుతాయన్నది పరిశోధించారు. ఈ పరిశోధన వివరాలను ఓ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. 
 
ఐఐఎస్‌సీ పరిశోధకులు భారతీయ డెంగీ స్ట్రెయిన్‌ల నుంచి 408 జెనెటిక్ సీక్వెన్స్‌లను పరిశీలించారు. ఈ సీక్వెన్స్‌లు 1956 నుంచి 2018 మధ్య కాలంలో సేకరించారు. ప్రస్తుతం కొత్తగా రూపాంతరం చెందిన డెంగీ వైరస్‌ను అడ్డుకునేందుకు అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments