అకారణంగా పక్షులు చచ్చి పడుతున్నాయా? అస్సలు తాకొద్దు, బర్డ్ ఫ్లూ అయి వుండొచ్చు

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (11:27 IST)
ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనావైరస్ భయంతో వణికిపోతున్నారు. దీనికితోడు ఇంగ్లాండు నుంచి కొత్త కరోనా కూడా వచ్చేసింది. ఇదిలావుంటే తాజాగా మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. బర్డ్ ఫ్లూ. ఈ వ్యాధి ఇప్పటికే 10 రాష్ట్రాల్లో వెలుగుచూసింది. ఎక్కడి పక్షులు అక్కడే గిలగిల కొట్టుకుని చచ్చిపోతున్నాయి. ఇలా అకారణంగా చనిపోతున్న పక్షులను చేతులతో ముట్టుకోవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
కాగా తాజాగా ఉత్తరాఖండ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారించబడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి చనిపోయిన 700 కాకుల నుంచి 8 నమూనాలను భోపాల్ మరియు బరేలీకి పంపారు. వాటిలో 2 నమూనాలు కోట్ద్వార్ నుండి మరియు డెహ్రాడూన్ నుండి ఒకటి బర్డ్ ఫ్లూని నిర్ధారించాయి. దీనితో అటవీ శాఖలో ప్రకంపనలు నెలకొన్నాయి. పక్షి ఫ్లూ విషయంలో ఉత్తరాఖండ్ అటవీ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
 
పక్షి ఎక్కడైనా చనిపోయినట్లు కనబడితే, దానిని తాకవద్దు, పాతిపెట్టడానికి లేదా కాల్చడానికి ప్రయత్నించవద్దని అటవీ శాఖను పశుసంవర్ధక శాఖ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అటవీ శాఖ బృందానికి తెలియజేస్తే చనిపోయిన పక్షి యొక్క నమూనాను తీసుకొని దానిని స్థలం నుండి తొలగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments