Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న విమానంలో.. నేడు ఆర్టీసీ బస్సులో.. మహిళపై మూత్ర విసర్జన చేసిన యువకుడు

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (11:05 IST)
కొందరు యువకులు మహిళల పట్ల అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికిమొన్న విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన ముందు సీట్లో కూర్చొనివున్న ఓ వృద్ధురాలైన మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. ఈ ఘటన పెను దుమారమే రేపింది. ఎయిరిండియా విమానంలో 70 యేళ్ల వృద్ధురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇపుడు ఇలాంటి ఘటనే కర్నాటక ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం జరగ్గా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
విజయపుర నుంచి మంగుళూరుకు వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సు హుబ్బళ్ళి సమీపంలోని కిరేసురులోని ఓ డాబా వద్ద ఆగింది. ప్రయాణికులంతా మూత్ర విసర్జన చేసేందుకు, టీ సేవించేందుకు బస్సు దిగారు. అయితే, 28వ నంబరు సీటులో కూర్చొనివున్న మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రామప్ప (25) అనే యువకుడు బస్సు ముందు వరుస సీట్లో కూర్చొనివున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. గాఢ నిద్రలో ఉన్న ఆమె ఈ అకస్మాత్తు చర్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ నిద్రలేకి బిగ్గరగా కేకలు పెట్టింది. దీంతో బస్సులోని మిగిలిన ప్రయాణికులంతా నిద్రలేచారు. 
 
లాగే, కిందకు దిగిన ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సులోకి వచ్చి, నిందితుడుని పట్టుకుని దేహశుద్ధి చేసి బస్సు నుంచి కిందకు దించేశారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికురాలు డాబాలోని గదిలోకి వెళ్లి స్నానం చేసి వచ్చేంత వరకు బస్సును ఆపారు. పీకల్లోతు మద్యంమత్తులో ఉన్న రామప్ప.. దిక్కుతెలియక ఈ పాడుపనికి పాల్పడ్డాడు. అయితే, ఈ ఘటనపై మహిళ పెద్ద మనసుతో పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments