Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసమా? అక్రమ సంబంధం సుఖం కోసమా? ఆరుగుర్ని చంపిన మహిళ

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (17:19 IST)
కేరళలో సంచలనం సృష్టిస్తున్న సీరియల్ కిల్లర్ కేసు. ఇదేదో మగవాడు చేసింది కాదు. ఓ స్త్రీ పథకం ప్రకారం గత 19 ఏళ్లుగా ఆచితూచి తను అనుకున్నవిధంగా హత్య చేస్తూ వచ్చింది. తొలుత అత్తమామలను, ఆ తర్వాత భర్తను, అనంతరం భర్త సోదరుడి భార్యాబిడ్డలను చంపేసింది. 
 
ఈమె ఈ దారుణానికి పాల్పడటం వెనుక ఆస్తి కోసమేనని చెపుతున్నారు. ఎందుకంటే అత్తమామల పేరుపైన కోట్లలో ఆస్తి వుంది. ఆ ఆస్తి అంతా ఉన్నఫళంగా అనుభవించేయాలన్న మిషతో వారిద్దర్నీ పైకి పంపేసింది. ఆ తర్వాత ఫోకస్ భర్త పైన పెట్టి అతడిని మట్టుబెట్టింది. 
 
కుటుంబంలో అంతా అంతమయ్యారు కనుక ఆస్తి ఆమెకి బదిలీ అయిపోయింది. ఐతే ఆమె అంతటితో ఆగలేదు. తన భర్త సోదరుడి కుటుంబంపైన కన్నేసింది. ఎందుకంటే అతడికి కూడా కోట్లలో ఆస్తి వుంది. అనుకున్నప్రకారం భర్త సోదరుడితో సన్నిహితంగా వుంటూ అతడి భార్యాబిడ్డలను లేపేసింది. ఆ తర్వాత ఎంచక్కా అతడిని పెళ్లాడింది. 
 
ఐతే వరుసగా చేసిన హత్యలన్నిటినీ సహజ మరణాలుగా చిత్రీకరించడంలో ఆమె పూర్తిగా సఫలమైంది. ఎందుకంటే ఒక్కొక్కర్నీ చంపేందుకు సంవత్సరాల తరబడు టైం తీసుకుంది. 2002లో మొదలైన ఈ సీరియల్ కిల్లింగ్ ఈ ఏడాది వరకూ సాగుతూ వచ్చింది. 
 
తన భర్త సోదరుడిని పెళ్లాడిన తర్వాత అతడిని కూడా అంతమొందించి ఆస్తినంతా కాజేద్దామన్న ప్రణాళిక రంచించిందని అంటున్నారు. కాగా వీరందరినీ బంగార నగల దుకాణంలో వుండే సైనైడ్ వేసి చంపేసినట్లు పోలీసులు నిర్థారించారు. ఐతే ఈమె ఇలా కుటుంబ సభ్యులను హత్య చేయడం వెనుక ఆస్తి కోసమా... లేదంటే అక్రమ సంబంధం సుఖం కోసమా... అదీ కాదంటే ఆమె సైకోగా మారిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు కేరళలో సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments