Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడమ చేయి గుంజుతోందని చెప్పిన కేసీఆర్: హుటాహుటిన యశోద ఆస్పత్రిలో చేరిక

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (12:22 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన్ని హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. గత రెండు రోజులుగా తన ఎడమ చేయి గుంజుతున్నట్లు అనిపిస్తోందని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో యశోద ఆసుపత్రికి తరలించారు.

 
శుక్రవారం 11 గంటలకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే బిజీ షెడ్యూల్ కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వాయిదా పడిందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది. 

 
కాగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవంలో కేసీఆర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి వుంది. ఐతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా పర్యటనను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ నెల 28న యాదాద్రి దేవాలయం కుంభాభిషేకం జరుగనుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments