మోడీకి ప్లస్.. చంద్రబాబుకి మైనస్.. ఏంటి?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:31 IST)
మోడీ - చంద్రబాబులకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏకంగా ఎపి సిఎం చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అది కూడా చంద్రబాబు తన వారసుడిని రాజకీయంగా నిలబెట్టాలని పాకులాడుతున్నారని, లోకేష్‌‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబునాయుడు కూడా అదేస్థాయిలో మోడీకి సమాధానం కూడా ఇచ్చారు.
 
కానీ చంద్రబాబు మాట్లాడిన తీరు విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయంగా తన కుటుంబాన్ని సుస్థిరం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మోడీ చెప్పారు కానీ బాబు మాత్రం ఏకంగా మోడీ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేశారు. తల్లిని, భార్యను పట్టించుకోని మోడీ కూడా నా గురించి మాట్లాడుతారా. భార్యకు విడాకులు కూడా ఇవ్వకుండా వదిలేసిన వ్యక్తి మోడీ అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత ఈ విధంగా మాట్లాడటం దేశ రాజకీయాల్లో చర్చ నీయాంశంగా మారింది. 
 
ఎందుకంటే ఒక దేశానికి ప్రధానికి ఉన్న వ్యక్తిపై ఇంతటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు. ప్రధానమంత్రి మోడీని చంద్రబాబు నాయుడు తిట్టడం వల్ల మోడీకే లాభం తప్ప బాబుకు ఏ మాత్రం లాభం ఉండదంటున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తుంటే మోడీకి ప్లస్ గాను, చంద్రబాబుకు మైనస్ గాను మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

Virosh: కొత్త లైఫ్ ను స్టార్ చేస్తున్నాం.. ఆశీర్వదించండి : రష్మిక మందన్న

పావలా శ్యామలకు అల్లు అర్జున్ ప్రతి నెలా ఆర్థిక సాయం.. ఎంతంటే?

Tarun Bhaskar: క్రేజీ కల్యాణం మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

తర్వాతి కథనం
Show comments