విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించాం : ఇస్రో

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (12:29 IST)
చంద్రుడి దక్షిణ ధృవం పరిశోధన నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-2 మిషన్ ద్వారా నింగిలోకి పంపిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్టు ఇస్రో మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. చంద్ర‌యాన్-‌2కు చెందిన ఆర్బిటార్‌.. విక్ర‌మ్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించిన‌ట్లు ఇస్రో పేర్కొన్న‌ది.
 
అయితే, విక్ర‌మ్ ల్యాండ‌ర్‌తో ఎటువంటి క‌మ్యూనికేష‌న్ జ‌ర‌గ‌లేద‌ని ఇస్రో వెల్లడించింది. ల్యాండ‌ర్‌తో క‌మ్యూనికేష‌న్ ఏర్ప‌రిచేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిపింది. సెప్టెంబ‌రు 7వ తేదీ అర్థరాత్రి 1.51 నిమిషాల స‌మ‌యంలో చంద్రుడి ఉప‌రిత‌లంపై విక్రమ్ ల్యాండర్ దిగుతూ కుదేలుకు (హార్డ్ ల్యాండింగ్) గురైంది. ఆ సమయంలో ల్యాండ‌ర్ వెలాసిటీ అదుపుత‌ప్ప‌డంతో అది స్టాఫ్ ల్యాండింగ్ స్థానంలో హార్డ్ ల్యాండింగ్ అయింది. దీంతో ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ బ్రేక‌య్యాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments