Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కపిలేశ్వర ఆలయంలో ఆడుకుంటున్న చిరుతపులులు (video)

Webdunia
బుధవారం, 19 మే 2021 (11:57 IST)
తిరుపతిలోని కపిలేశ్వర ఆలయంలో చిరుతపులుల సంచారం కలకలరేపుతోంది. రెండు చిరుత పులులు ఆలయంలో తిరుగుతూ కనిపించాయి. ఈ దృశ్యాలన్నీ మొత్తం సి.సి.టీవీలో రికార్డయ్యాయి. అయితే కరోనా కారణంగా ఆలయాన్ని మూసివేయడంతో నిర్మానుషంగా ఉన్న కారణంగా చిరుతలు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది భావిస్తున్నారు.
 
కరోనా కారణంగా తిరుమలలో క్రమేపీ భక్తుల సంఖ్య తగ్గుతుంటే స్థానిక ఆలయాల్లో అయితే భక్తులే కనిపించడం లేదు. అందులోను స్థానిక ఆలయాలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉండడంతో భక్తులు తక్కువ సంఖ్యలో దర్సనం చేసుకుంటున్నారు. 
 
ఆ తర్వాత భక్తులు లేకపోవడంతో ఆలయాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అందులోను టిటిడి ఆధ్వర్యంలో నడుపబడే తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం సరిగ్గా శేషాచలం అడవులకు సమీపంలో ఉంది. శేషాచలం అడవుల్లో చిరుత పులల సంచారం ఎప్పటి నుంచో ఉంది. నిర్మానుషంగా ఉండటంతో చిరుత పులులు ఇష్టానుసారం జనం తిరిగే ప్రాంతంలోకే వచ్చేస్తున్నాయి.
 
కపిలేశ్వర ఆలయంలో కూడా రాత్రి 7 గంటల సమయంలో రెండు చిరుతపులులు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సిసి కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడున్న టిటిడి సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. అయితే అప్పటికే చిరుతలు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. కానీ మొట్టమొదటి సారి ఆలయంలోకి చిరుతలు రావడం ఇదే ప్రధమమంటున్నారు టిటిడి అధికారులు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments