కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదు - దేశంలో 7కి చేరిన కేసులు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (13:46 IST)
దేశంలో ఒకవైపు కరోనా వైరస్‌తో పాటు మరోవైపు మంకీపాక్స్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ రోజువారీ నమోదు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ మంకీపాక్స్ వైరస్ మాత్రం చాపకిందనీరులా వ్యాపిస్తుంది. ఫలితంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఏడుగుకు చేరింది. 
 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 27న కోజికోడ్ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన్ను మలప్పురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
 
కాగా, మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తి త్రిశూర్‌లో ఈ నెల ఒకటో తేదీన ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో అతనితో సంబంధాలు కలిగిన 20 మందిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments