Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులుగా భావించి భద్రతా బలగాల కాల్పులు - 14 మంది పౌరులు మృతి

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:48 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌లో దారుణం జరిగింది. భారత భద్రతా బలగాలు పెద్ద తప్పు చేశారు. సాధారణ పౌరులను ఉగ్రవాదులుగా భావించారు. దీంతో వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా నాగాలాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దారుణం మోన్ జిల్లాలోని తిరు గ్రామంలో జరిగింది. 
 
అంతకుముందు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సాధారణ పౌరులను భద్రతా బలగాలు ఉగ్రవాదులుగా భావించి, ఈ కాల్పులు జరిపారు. మోన్ జిల్లా తిరు గ్రామంలోని ఓటింగ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలువురు జవాన్లు మృతిచెందారు. 
 
దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట చేపట్టింది. ఆ సమయంలో అటుగా వస్తున్న తిరు గ్రామానికి చెందిన కూలీలపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో 14 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం రాత్రి జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హింసకు పాల్పడ్డారు. ఎన్ఎస్సీఎన్ మిలిటెంట్లుగా పొరపాటున అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం