Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ సమాధికి మోకరిల్లి సారీ చెబితే... రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపు

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:54 IST)
అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఆర్కే నగర్ ఎమ్మెల్యే, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వైపు ఉన్న 18 మంది అన్నాడీఎంకే అసంతృప్త ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును హైకోర్టు కూడా సమర్థించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ మాజీ శాసనసభ్యులందరూ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధివద్ద మోకరిల్లి క్షమాపణ చెబితే వారిని మళ్లీ పార్టీలో చేర్చుకుంటామని అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ మేరకు  ఆ పార్టీ పత్రిక నమదు అమ్మాలో మాజీ శాసనసభ్యులంతా మళ్లీ పార్టీలో చేరాలని ఆహ్వానించింది. 
 
అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్‌ మినహా తక్కినవారినందరినీ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమేనని ఆ పార్టీ ప్రకటించిన మరుసటి రోజే మాజీ ఎమ్యెల్యేలను ఆహ్వానిస్తూ ఓ వ్యాసం ఆ పత్రికలో ప్రచురితమవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
మాజీ శాసనసభ్యులు 18 మంది మెరీనాబీచ్‌లోని జయ సమాధివద్ద మోకరిల్లి క్షమాపణలు చెప్పుకుంటే భేషరతుగా వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకుంటామని అందులో పేర్కొంది. దీనిపై అన్నాడీఎంకే వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments