Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నారనీ.. నూలుపోగు లేకుండా ఊరేగించారు... ఎక్కడ?

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్న నేరానికి శరీరంపై నూలు పోగు లేకుండా చేసి గ్రామంలో ఊరేగించారు. పైగా, ఈ ఊరేగింపును కొందరు యువకులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో

Webdunia
శనివారం, 7 జులై 2018 (17:08 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్న నేరానికి శరీరంపై నూలు పోగు లేకుండా చేసి గ్రామంలో ఊరేగించారు. పైగా, ఈ ఊరేగింపును కొందరు యువకులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఊరేగింపు వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదైపూర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉదయ్‌పూర్ పరిధిలోని సెర్ గ్రామానికి గిరిజన తెగకు చెందిన యువకుడు సమీప గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులు వారిద్దరికీ శిక్ష విధించారు. ఇద్దరినీ పట్టుకుని లోదుస్తులు తొలగించి తాళ్లతో కట్టేశారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. 
 
జనాలు వారిని వీడియో తీస్తూ వినోదం చూశారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విస్మయపరుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ప్రేమ జంటను విడిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments