Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్‌కు చెక్ పెట్టే ఔషధం : బ్రిటన్‌లో ఆశాదీపంలా ఆ మందు...

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (19:46 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్. ఇప్పటికే ఆఫ్రికా దేశాలతో పలు అగ్రరాజ్యాల్లో ఈ కేసులు బయటపడుతున్నాయి. గురువారం భారత్‌లో కూడా నాలుగు కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఒమిక్రాన్‌కు చెక్ పెట్టే ఔషధాన్ని గుర్తించింది. ఆ మందు పేరు సోట్రోవిమాబ్. ఈ మందు ఇపుడు బ్రిటన్‌లో ఓ ఆశాదీపంలా మారింది. ఈ మందు ఒమిక్రాన్ సోకిన రోగుల్లో ముప్పును దాదాపు 80 శాతం మేరకు తగ్గిస్తుందని తేలింది.
 
మరోవైపు, ఒమిక్రాన్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరిస్తుంది. అంతేకాకుండా, ఈ వైరస్ ఎంత ప్రమాదకారో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పింది. అయితే, ఒమిక్రాన్ పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. 
 
మరోవైపు, ఒమిక్రాన్‌కు తగిన మందును కనిపెట్టినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈ మందు పేరు సోట్రోవిమాబ్ అని, ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఈ మందును ఉత్పత్తి చేస్తుందని తెలిపుతూ, ఈ మందుకు బ్రిటన్ ఔషధ నియంత్రణ ఆగమేఘాలపై ఆమోదముద్ర వేసింది. 
 
ఒమిక్రాన్ వైరస్ సోకినవారికి ఓ ఔషధాన్ని ఇంజెక్షన్‌‍తో యాంటీబాడీ చికిత్స వారిలో మరణించే ప్రమాదం 79 శాతం మేరకు తగ్గుతుందని పేర్కొంది. ఈ మందును నరాల ద్వారా శరీరంలోకి ఎక్కించగా, కరోనా వైరస్ మానవ కణాల్లో ప్రవేశించడాన్ని సమర్థంగా  అడ్డుకున్నట్టు పరిశోధనల్లో వెల్లడైందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments