తల్లి ఆవును కొట్టిన వ్యక్తిని దూడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (14:14 IST)
Cow calf
మూగ జీవాలు పిల్లల్నీ కాపాడుకోవాలని తల్లి ఏ విధంగా పోరాడుతుందో, పిల్లలు కూడా తల్లి కోసం అలాగే చేస్తాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తల్లిని కొట్టిన ఓ వ్యక్తిని ఆవుదూడ ఎగరి ఓ తన్ను తన్నింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంతా నంద దీన్ని పోస్టు చేశారు. ఇది చూసిన నెటిజన్లు కర్మ అనుభవించక తప్పదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 
ఈ వీడియోలో ఓ డైరీ ఫాంలో ఆవుల గుంపు దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లాడు. అక్కడ ఆవులను పక్కకు వెళ్లాలంటూ కర్ర తీసుకొని కొట్టాడు. హేయ్‌ హేయ్ అంటూ బెదిరించాడు. అంతలోనే ఆ పక్క నుంచి ఆవు దూడ పెరిగెత్తుకు వచ్చింది.
 
అంతేకాకుండా కోపంతో పైకి ఎగిరి వెనక కాళ్లతో బలంగా తన్నింది. అతడు వెనక్కి పేడలో పడిపోయాడు. దీంతో అతని తెల్ల చొక్కా కాస్తా పేడమయం అయింది. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లిపోయాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఇది చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments