Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ మాటకారి... చేతలు శూన్యం : మంత్రి యనమల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు.

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు. 
 
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేసుకుని ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆదివారం ప్రధాని అధికారిక నివాసం ఎదుట మెరుపు ధర్నా చేసిన టీడీపీ ఎంపీలను నిర్దాక్షిణ్యంగా లాగిపారేశారు. 
 
దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏపీలో 2014లో వచ్చిన ఓట్లలో పదో వంతు ఓట్లు కూడా రావన్నారు. ప్రధాని మోడీ నాలుగేళ్లలో పేదలకు, మధ్య తరగతికి చేసిందేమీ లేదని, బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
నాటకాలలో బీజేపీది అందవేసిన చెయ్యని, ఏపీని, టీడీపీని విమర్శించడానికే జీవీఎన్‌ నరసింహారావుని బీజేపీ రాజ్యసభకు పంపినట్లుందని వ్యాఖ్యానించారు. చట్టంలో పొందు పర్చిన అంశాలను అమలు చేయమంటే బీజేపీకి ఎందుకంత కోపం వస్తుందని యనమల ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments