వాస్తు: ఇల్లు శుభ్రంతో పురోగతి.. టాయ్‌లెట్‌ను అలా వదిలేయకండి..

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:30 IST)
ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు ఇట్టే తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మహిళలు ముఖ్యంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చీపురుతో ఊడ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు చిమ్మడం ద్వారా ఆర్థిక పురోగతి వుండదు. అది సంపదపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. 
 
ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల మన మనస్సు, శరీరం, ఆరోగ్యంతో పాటు మన పురోగతి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రిపూట పొరపాటున కూడా చీపురుతో ఇల్లు చిమ్మకూడదు. అలా చేస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
ఇంట్లోని టాయిలెట్‌లను కూడా ప్రత్యేకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూంలను అశుభ్రంగా ఉంచడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఒక బాత్రూమ్‌లను ఎప్పుడూ బూజు పట్టకుండా చూసుకోవాలి. 
 
బాత్రూమ్-టాయిలెట్ కారణంగా ఏదైనా వాస్తు దోషం ఉంటే, అప్పుడు ఉప్పు నింపిన గిన్నెను ఒక మూలలో ఉంచితే దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా బాత్‌రూమ్‌లో చెత్త పేరుకుపోకుండా చూడాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్‌వర్క్

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments