Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరిక పోచలతో వినాయక పూజ చేస్తే?

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:23 IST)
విఘ్నేశ్వరుడిని వినాయక చతుర్థినాడు పూజించే భక్తులకు క్షేమం, లాభం కలుగుతుందని విశ్వాసం. అందువల్ల వినాయక చవితి నాడు చేసే పూజలో ప్రధానమైంది 21 పత్రపూజ అని, వీటిలో గరిక (దూర్వాపత్రం)తో వినాయక స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. గణనాథుడికి ఎక్కువ ఇష్టమైన గరికను విఘ్నేశ్వర పూజలో జంట గరిక పోచలతో 21 సార్లు పూజించాలి.  
 
యమధర్మరాజు కుమారుడైన అనలాసురుడు.. అగ్ని సంబంధిత తేజస్సుతో పుట్టడం వల్ల అతని శరీరం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు లోకాల్ని బాధిస్తుంటాయి. ఆ సమయంలో గణేశుడిని దేవేంద్రుడైన ఇంద్రుడు ప్రార్థించగా.. విఘ్నేశ్వరుడు అనలాసురుడిని నమిలి మింగేస్తాడు.
 
ఫలితంగా గణపయ్య బొజ్జలో అధిక ఉష్ణం జనించి, తాపం కలుగుతుంది. అమృతాలతో అభిషేకించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు ముక్కంటి అయిన పరమేశ్వరుడు జంట గరికపోచలతో గణేశ్వరుడిని పూజచేయాలని సూచిస్తాడు. పరమేశ్వరుని సలహాతో దేవతలు గణపతిని పూజిస్తారు. ఆ గరిక పూజతో గణపతి తాపం చల్లారిపోతుంది. అప్పటి నుంచి గణపతికి గరిక ప్రీతిపాత్రమైందని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్త అలాంటివాడు, అందుకే కండక్టర్‌తో వెళ్లిపోయా: యూట్యూబర్ అఖిల్ భార్య

అలాంటి యూట్యూబర్లపై నిషేధం విధించండి : సీఎం విజయ్‌కు విశాల్ వినతి

తుపాకులు వదిలి ర్యాంప్ వాక్ చేసిన మాజీ నక్సలైట్ (Video)

Kuppam: కుప్పం విమానాశ్రయంపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ.. సంగతేంటి?

పంచదార్ల అక్రమ మైనింగ్‌.. పార్లమెంట్‌లో ఆందోళనకు దిగనున్న వైకాపా

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

13-08-22026 ఫలితాలు - రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి

గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?

మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు - రూ.210 కోట్లు మంజూరు

12-08-2026 బుధవారం మీ రాశి ఫలితాలు - రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు..

తర్వాతి కథనం
Show comments