Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మళ్లీ సీఎం కాకపోతే జ్యోతిషం వదిలేస్తా... ఎవరు?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (13:57 IST)
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతాయన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరుగుతోంది. ఎందుకంటే... అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ సీఎం పదవి తమను వరిస్తుందంటే తమను వరిస్తుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ ఓ నేమ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. 
 
ఇవన్నీ ఇలావుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదెపా ఢంకా బజాయించి విజయం సాధిస్తుందంటూ ప్రముఖ జ్యోతిష్కుడు అంటున్నారు. తెదేపాకు ఏకంగా 112 సీట్లు వస్తాయని చెపుతున్నారు. ఈ బంపర్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని చెప్పారు. ఇదే వాస్తవం కాబోతోంది చూడండి అంటూ ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణుడు శివరామశాస్త్రి చెపుతున్నారు.
 
ఒకవేళ తను చెప్పిన జ్యోతిషం నిజం కాకపోతే భవిష్యత్తులో జ్యోతిషం చెప్పడం మానేస్తానని సవాల్ కూడా చేశారు. అంతేకాదు తను చెప్పిన మాటను రూ. 100 బాండ్ పేపరుపై రాసిమ్మన్నా రాసిచ్చేందుకు తను సిద్ధంగా వున్నానని అంటున్నారు. మొత్తమ్మీద ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి బాబు అని కొందరంటుంటే జగన్ అని మరికొందరు అంటున్నారు. మరి ఏపీ ప్రజల తీర్పు ఎలా వుందో తెలియాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments