Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజులు సెలవులు

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (22:17 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళా దినోత్సవం నాడు ఇచ్చిన హామీని రెండు రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని మహిళా దినోత్సవం రోజు వైఎస్ జగన్ నిర్ణయించగా.. ప్రత్యేక సీఎల్ లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రస్తుతం ఉన్న 15 రోజుల సెలవులకు అదనంగా ఐదు సెలవులు మంజూరు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సెలవులు మహిళా టీచర్లు, లెక్చరర్లకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఈ మేరకు జీవో నెం.18ని విడుదల చేసింది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇందుకుగానూ సీఎం వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments