డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్ జారీచేసిన ఏపీపీఎస్సీ

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (16:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్డు-గ్రామ సచివాలయ ఉద్యోగుల కోసం డిపార్ట్‌మెంటల్ పరీక్షను నిర్వహిచనున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహిస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీఅయింది. 
 
ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించి దరఖాస్తు విధానంపై స్పష్టతనిచ్చింది. 
 
ఎవరైతే ఉద్యోగులు ఈ పరీక్షలకు హాజరవుతారో.. వారంతా ముందుగా.. ఏపిపిఎస్సీ వెబ్‌సైట్‌లో ఆయా ఉద్యోగులు ఓటిపిఆర్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. వారికి ఓటిపిఆర్‌లో వ‌చ్చే యూజ‌ర్ ఐడితో అన్‌లైన్‌లో ధ‌ర‌కాస్తుకు చేసుకోవాలని సూచించింది. 
 
ఈ నెల 13 నుండి 17 వ‌ర‌కు అన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుకు చేసుకొనేందుకు అవ‌కాశం ఉన్నట్లుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షలు మొత్తం 100 మార్కుల‌కు పరీక్ష నిర్వ‌హిస్తుండ‌గా.... అందులో 40 మార్కులు పైగా వ‌చ్చిన ఉద్యోగుల‌కు మాత్రమే ప్రొబేష‌న‌రీకి అర్హ‌త సాదించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments