Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురి యువకుల ప్రాణాలు తీసిన బొగ్గులకుంపటి

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (09:36 IST)
మేడ్చల్ జిల్లాలో ఓ బొగ్గుల కుంపటి నలుగురి ప్రాణాలు తీసింది. వెచ్చదనం కోసం వెలిగించిన ఈ కుంపటి కారణంగా చివరకు నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలమూరు జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ మండలం బొమ్రాస్‌పేట గ్రామశివారులో ఉన్న ఓ కోళ్ళఫారంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. 
 
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. యువకులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ విచారణలో బొగ్గుల కుంపటి వల్లే నలుగురు చనిపోయినట్లు పోలీసులు తేల్చారు. రాత్రి కోళ్లకు టీకాలు వేసిన తర్వాత నలుగురు యువకులు మద్యం సేవించారు. గదిలోకి వెళ్లిన తర్వాత వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటిని వెలిగించారు. తలుపులు, కిటికీలు మూసివేయడం వల్ల ఊపిరాడక చనిపోయారంటూ పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments