Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ళలో స్ప్రే చల్లి... మిస్టరీగా హోటల్ యజమాని హత్య!

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (09:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. హోటల్ యజమాని కళ్ళలో స్ప్రే కొట్టి చంపేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలలోని పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లూరు గ్రామంలో ఈ హత్య జరిగింది. భాష్యం బ్రహ్మయ్య అనే వ్యక్తి గ్రామంలో చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. చెత్త పారవేసేందుకు బ్రహ్మయ్య ఊరి చివరకు వెళ్లాడు.
 
ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనాలపై వచ్చి బ్రహ్మయ్య ముఖంపై స్ప్రే చల్లి దాడి చేశారు. ఆ స్ప్రే కళ్లలో పడడంతో మంటలు పుట్టాయి. దాంతో కుటుంబ సభ్యులు బ్రహ్మయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. 
 
ఈ ఘటన పెదకూరపాడు మండలంలో తీవ్ర కలకలం రేపింది. బ్రహ్మయ్యను హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments