Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతంత్ర్యదినోత్సవం.. 771 అడుగుల జాతీయ జెండాతో రోజా ర్యాలీ (వీడియో)

వైకాపా ఎమ్మెల్యే రోజా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం రోజా ర్యాలీగా కదిలారు. ఈ ర్యాలీలో జాతీయ జెండాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింద

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (18:35 IST)
వైకాపా ఎమ్మెల్యే రోజా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం రోజా ర్యాలీగా కదిలారు. ఈ ర్యాలీలో జాతీయ జెండాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ పుత్తూరులో భారీ జెండాతో ఈ ర్యాలీ సాగింది.

ఈ ర్యాలీలో భారీ ఎత్తున వైకాపా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. 771 అడుగుల జాతీయ జెండాతో ఈ ర్యాలీ జరిగింది. పుత్తూరులో జరిగిన ఈ ర్యాలీకి భారీ స్పందన లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రోజా విద్యార్థులను బ్యాగులను అందజేస్తారు.
 
ఇదిలా ఉంటే.. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలకు, రోజాకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. భూమా అఖిల ప్రియపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం, రోజాపై ఆ పార్టీ నేత అగ్ర నేత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంకా సోషల్ మీడియాలో రోజాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వ్యతిరేక వార్తలపై రోజా ఫైర్ అయ్యారు. తాను చనిపోయానంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫొటోలను ప్రచారం చేయడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. తన రాజకీయ శతృవులు దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని రోజా మండిపడ్డారు. తనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నానని హెచ్చరికలు జారీ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments