Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఆస్తుల కేసు... ప్రధాని మోదీకి మారిషస్ నుంచి నోటీసులెందుకు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసు నేపధ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలకు చెందిన ప్రాజెక్టులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటివాటిలో ఒకటైన టెక్ జోన్ ఐటీ సంస్థ కూడా ఒకటి. మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ ఐటీ సెజ్ కోస

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (13:58 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసు నేపధ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలకు చెందిన ప్రాజెక్టులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటివాటిలో ఒకటైన టెక్ జోన్ ఐటీ సంస్థ కూడా ఒకటి. మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ ఐటీ సెజ్ కోసం మొత్తం రూ. 115 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులు దశలవారీగా పెడుతూ వచ్చింది. ఐతే జగన్ ఆస్తుల కేసులో ఇందూ టెక్ జోన్ కూడా ఇరుక్కుంది. 
 
ఈ కంపెనీలో మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ వాటా 49 శాతం వుంది. సీబీఐ కేసులతో తాము పెట్టిన పెట్టుబడులకు భారీ నష్టం వాటిల్లిందనీ, మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్సులోని ఆర్బిట్రేషన్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. తమకు 50 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇప్పించాలని తన పిటీషన్లో కోరింది. ఫిర్యాదు అందుకున్న న్యాయస్థానం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. నోటీసులు అందాయని తెలంగాణ ప్రభుత్వం ధృవీకరించడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments