Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏజెన్సీలో కారును తగలబెట్టిన మావోయిస్టులు (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళుతున్న అడ్డగించి, అందులోని ప్రయాణికులను కిందకు దించేసిన మావోయిస్టులు.. ఆ తర్వాత కారుకు నిప్పుపెట్టి తగలబెట్టేశారు. కారులో ఉన్న ప్రయాణికులను దింపి అనంతరం కారుకు నిప్పుపెట్టారు. 
 
ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాలకు పిలుపునిచ్చి, విజయవంతంగా నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే, ఈ వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, దగ్ధమైన కారు ఎటు నుంచి బయలుదేరింది. ఎంత మంది వ్యక్తులు అందులో ప్రయాణించారు అనే సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన చింతూరు వైపు నుంచి భద్రాచలం వెళ్లే రహదారి మధ్యలో సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో జరిగినట్టు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదు. ఇపుడు మళ్లీ జరగడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments