బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (08:50 IST)
తనపై అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి వాపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరుష పదజాలంతో దూషించినందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదైవుండగా, ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో కోర్టులో హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట పోసాని బోరున విలపించారు. తనపై వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇప్పటికి రెండు ఆపరేషన్లు జరిగాయని, స్టెంట్లు వేశారని గుర్తుచేశారు. 70 యేళ్ల వయసులో తనను ఇబ్బంది పెడుతున్నారు. తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే శరణ్య. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోసానికి పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై అదులోకి తీసుకోవడంతో విడుదల సాధ్యపడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments