Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడున్నర సంవత్సరాలైనా ఏపీ రాజధాని ఎక్కడో తెలీదు, మళ్లీ గందరగోళం: పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (21:46 IST)
ఏపీ 3 రాజధానులు బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త రూపంతో వస్తానంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ విడిపోయి ఏడున్నర సంవత్సరాలైనా అసలు రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలోకి పాలకులు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 
ఆనాడు అసెంబ్లీలో రాష్ట్ర రాజధానిపై చర్చ జరిగినప్పుడు జగన్ మోహన్ రెడ్డి అంగీకరించి ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతుల త్యాగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందనీ, అలాంటి త్యాగం ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలకు పూర్తిగా న్యాయం జరగాలన్నా రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలన్నా రాష్ట్రానికి ఒకే రాజధాని వుండాలన్నారు. ఆ రాజధానిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలని జనసేన కోరుకుంటోందని చెప్పారు.

 
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటానికి జనసేన సంపూర్ణ మద్దతు వుంటుందన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులను మార్చడం ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments