Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్‌పై చేతులెత్తేసిన జగన్ సర్కారు.. అసెంబ్లీ చర్చ!

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:30 IST)
తన సొంత జిల్లా కడపలో నెలకొల్పతలపెట్టిన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది. దీనికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ప్లాంట్ ఏర్పాటు చేయకపోవడానికి కరోనా మహమ్మారి అంటూ సెలవిచ్చారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టీడీపీ లేవనెత్తిన ప్రశ్నపై అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్ళవుతున్నా ఇంతవరకు కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. సొంత జిల్లాలోని ప్లాంట్ నిర్మాణాన్ని కూడా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. 
 
దీనికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కరోనా వల్ల ప్రపంచమే కుదేలైందని, స్టీల్ పరిశ్రమ పూర్తిగా డౌన్ అయిందన్నారు. కరోనాతో రెండేళ్లు గడిచిపోయాయని చెప్పారు. ఈ విషయాలు తెలుసుకోకుండా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments