Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు రౌడీలా.. ప్రజా ప్రతినిధులా? పార్టీని నాశనం చేస్తున్నారు.. టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్

విజయవాడ ఆర్టీఓ కార్యాలయ అధికారులపై దౌర్జన్యం చేసి దాడి చేసిన సొంత పార్టీ ప్రజా ప్రతినిధులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మీరంతా.. రౌడీలా... లేక ప్రజా ప్రతినిధులా? మీకు జగన్‌కు ఉన్న తేడా

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (10:47 IST)
విజయవాడ ఆర్టీఓ కార్యాలయ అధికారులపై దౌర్జన్యం చేసి దాడి చేసిన సొంత పార్టీ ప్రజా ప్రతినిధులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మీరంతా.. రౌడీలా... లేక ప్రజా ప్రతినిధులా? మీకు జగన్‌కు ఉన్న తేడా ఏంటి? అంటూ ఆయన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 
 
ఏపీ ఆర్టీఏ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ అంశంలో విపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం చంద్రబాబు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. టీడీపీ నేతల దురుసు ప్రవర్తనపై పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. కేశినేని నాని, బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరాను తన కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్‌ తీసుకున్నారు. తక్షణమే ఆర్టీఏ కమిషనర్‌, సిబ్బందికి క్షమాపణ చెప్పాలని సూచించారు. 
 
పార్టీ అధినేత చంద్రబాబు క్లాస్‌ తీసుకోవడంతో టీడీపీ నేతలు నేరుగా రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు క్షమాపణలు చెప్పారు. మనసు నొచ్చుకుని ఉంటే మన్నించాలని కోరారు. శనివారం జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. సీఎం సూచన మేరకు కమిషనర్‌కు విచారం వ్యక్తం చేశామని, తమకు ఎలాంటి బేషజాలు లేవన్నారు. ఉద్యోగులపై దాడితో ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని ఆర్టీఏ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం అన్నారు. 
 
ప్రజలకు సేవ చేయాలని చెప్పే ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడటం మంచిదికాదన్నారు. టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పడంతో.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నామన్నారు. మొత్తానికి టీడీపీ నేతల క్షమాపణలతో ఈ వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments