Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నా : డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (11:55 IST)
మూడు రాజధానుల ఏర్పాటును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. ఇందుకు నిరసన తెలిపే చర్యల్లో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ఇదే బిల్లును మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై నిబంధన 71 ప్రకారం చర్చకు టీడీపీ పట్టుబట్టింది. దీంతో చర్చ ఏ విధంగా సాగాలన్న అంశంపై మండలి ఛైర్మన్ తన చాంబర్‌లో అధికార, విపక్ష సభ్యులతో చర్చలు జరుపుతున్నారు.
 
ఇంతలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. పైగా, ఆయన మంగళవారం సభకు కూడా రాలేదు. ఆయనతో పాటు.. మరో ఎమ్మెల్సీ శమంతకమణి కూడా మంగళవారం సభకు హాజరుకాలేదు. దీంతో ఆమె కూడా రాజీనామా చేసిందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఈ బిల్లుపై మండలిలో చర్చ చేపట్టడానికి ముందే డొక్కా రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments